కామారెడ్డి, బతుకమ్మ : ఆర్గోoడ- కొండాపూర్ గ్రామాల మధ్య ఇటీవల భారీ వర్షాల కారణంగా అటవీ ప్రాంతంలో ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. దీంతో మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు పైన మొరం పోసి చేతులు దులుపుకున్నారు.ఆటోలు, ద్విచక్రవాహనదారులు మట్టి రోడ్డు గుండా వెళ్లడానికి అవస్థలు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
