జిల్లా పరిషత్ ఉద్యోగులకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నగరంలోని జిల్లా పరిషత్ ఉద్యోగులకు 3వ టౌన్ ఎస్సై హరిబాబు ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మాసోత్సవాలు పురస్కరించుకుని అవగాహన కల్పించారు. శుక్రవారం అరేయ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా సుభాష్ నగర్ లోని జెడ్పి కార్యాలయ ఉద్యోగులకు, సిబ్బందికి రోడ్డు భద్రతా నియమాల గురించి సలహాలు, సూచనలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు.