బతుకమ్మ, మెండోరా: మెండోరా మండలంలోని బుస్సాపూర్ గ్రామంలో గల రైతు వేదికలో మత్స్య సహకార సంఘాల సభ్యులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. మత్స్య సహకార సంఘం ఏడి ఆంజనేయులు స్వామి మాట్లాడుతూ మత్స్య సహకార సంఘాల వ్యవహారాలు, ఎంసీ విధులు, బాధ్యతలు, అడిక్ట్, పుస్తకాల నిర్వహణ, ఎన్నికల విధివిధానాలు, ఓటర్ జాబితా తయారీ, వివిధ రకాల స్కీమ్ లపై మత్స్య కార్మికులకు అవగాహన కల్పించారు. అనంతరం మత్స్య సహకార సంఘం సభ్యులు అధికారులను సన్మానించారు. కార్యక్రమంలో ఎస్బిఐ బ్యాంక్ లావాదేవీలాధికారి అశోక్ చావన్, ఆడిట్ అధికారి భారీ, నాలుగు మండలాల అధ్యక్షులు కార్యదర్శిలు తదితరులు పాల్గొన్నారు.

