27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

కూతురును వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు కత్తులతో దాడి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : తన కూతురును ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించిన తండ్రిని కత్తులో పొడిచిన ఘటన బుధవారం నగరంలో చోటుచేసుకుంది. నగరంలోని ఆరో టౌన్​ పరిధిలోని అక్బర్​నగర్ లో షేక్ గౌస్ నివాసం ఉంటున్నాడు. షేక్​గౌస్​ కూతురిని అదే ప్రాంతానికి చెందిని ఇద్దరు యువకులు సోహైల్​, పర్వేజ్​ వేధిస్తున్నారు. ఈ  విషయాన్ని తెలుసుకున్న షేక్​ గౌస్​ తన భార్య ఫర్హానాతో కలిసి సోహైల్​ ఇంటికి వెళ్లి నిలదీశాడు. దీంతో కోపోద్రిక్తులైన యువకులు కత్తితో షేక్​గౌస్​పై దాడి చేశారు. అనంతరం భార్య ఫర్హానాపై దాడి చేశారు. విషయం తెలుకున్న నార్త్​ రూరల్ సీఐ సురేష్​బాబు, 6వ టౌన్​ ఎస్సై వెంకట్రావు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాణాపాయస్థితిలో ఉన్న షేక్​గౌస్​ను నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article