- ఆర్గనైజర్ డాక్టర్ కాసర్ల నరేశ్ రావు
బాసర, బతుకమ్మ : నిర్మల్ జిల్లా బాసరలో ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి ఆస్థావధానం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రాం ఆర్గనైజర్ కాసర్ల నరేష్ రావు తెలిపారు. ఆసిఫాబాద్ కు చెందిన ప్రముఖ అష్టావధాని బ్రహ్మశ్రీ మాడుగుల నారాయణమూర్తిచే అష్టావధానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందూరు జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ అష్టావధాని డాక్టర్ గణపతి అశోక శర్మ సభాధ్యక్షతన నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో డాక్టర్ శారద, గుడి రాజేశ్వర శర్మ, బానావత్ నితిన్, తొగరి రాజేశ్వర్, చింతల శ్రీనివాస్ గుప్తా, తాడూరి గంగాధర్, కంకణాల రాజేశ్వర్, జారీకోట్ బాబురావులు ప్రుచ్చకులుగా వ్యవహరిస్తారని అన్నారు. అవధానంలో ఆసక్తిగల వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, అష్టావధానాన్ని విజయవంతం చేయాలని కాసర్ల కోరారు.
