ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని బీడీ వర్కర్స్ కాలనీలో ఆర్టీసీ బస్ డిపో పక్కన ఉన్న బగలాముఖి పీఠంలో శుక్రవారం అమ్మవారి జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా అష్టమి పూజ నిర్వహించారు. పీఠం నిర్వాహకులు క్రాంతి పటేల్ ఆధ్వర్యంలో ఉదయం నుండి వివిధ పనుల రసాలతో అభిషేకాలు అర్చనలు నిర్వహించి మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రాంతి పటేల్ మాట్లాడుతూ భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. ఈ పూజ కార్యక్రమానికి రాష్ట్రం లోని వివిధ జిల్లాలు మండలాలకు చెందిన వారు భక్తులు ,స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు, , రేవంత్ అప్ప, సంతోష్ , శైలేందర్ , శివ,తదితరులు పాల్గొన్నారు.
