రూ.1,11,111 పలికిన ఆర్యవైశ్య గణేష్ మండలి లడ్డు
బతుకమ్మ, పిట్లం :
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య గణేష్ మండలి లడ్డు రికార్డు ధర కు వెలంలొ దక్కించుకున్నారు భక్తులు. ఆర్యవైశ్య గణేష్ మండలి పిట్లం ఆధ్వర్యంలో తోమ్మిది రోజులపాటు విశేష పుజలు అందుకున్న గణనాథుడి లడ్డు వేలంపాటలో రూ. 1,11,111 ధరకు ఉప్పు కిష్టయ్య సెట్ పుత్రుడు ఉప్పు విట్టల్ వేలంపాటలో పాల్గొని దక్కించుకున్నారు . ఈ సందర్బంగా ఆర్యవైశ్య మండల అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కంటే ఈసారి రూ.1,11,111 వేలంపాట రికార్డ్ స్థాయిలో వెలం జరిగిందని అన్నారు.. మండలంలోని 12 గనపయ్యలు ఆదివారం రాత్రి నిమజ్జనం చేశారు. డీజే లతో యువకులు అలరిస్తూ డాన్సులు చేస్తూ ఘనంగా గణపయ్యను సాగనంపించారు.. నిమజ్జన కార్యక్రమంలో గంగ ప్రవీణ్, వేణుగోపాల్, ప్రసాద్, యువకులు మహిళలు పాల్గొన్నారు.
