కమ్మర్ పల్లి, బతుకమ్మ : కమ్మర్ పల్లి మండల కేంద్రం శివారులో పేకాట ఆడుతున్న ఏడుగురిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు. పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.30,530 నగదు, ఏడు సెల్ ఫోన్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
