ఆర్మూర్, బతుకమ్మ : ఏడు రోజులుగా తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషన్ పెంచిన రెట్లను అమలు చేయాలనీ డిమాండ్ చేస్తూ ఆర్మూర్ పట్టణంలో సమ్మె చేస్తున్న అమలీలను యూనియన్ నాయకులను పోలీసులు మంగళవారం రోజు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా ఏఐటీయూసీ జిల్లా నాయకులు.ఆరెపల్లి సాయిలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన అమలి రెట్లను అమలు చేయాలని కోరుతూ సమ్మెకు దిగిన అమలీలను అమలి నాయకులను అక్రమ అరెస్ట్ చేయడం సరైనది కాదని తక్షణమే పెంచిన అమలి రెట్లను అమలు చేయాలనీ కోరారు.. పోలీసులు ఆరెపల్లి సాయిలు తో పాటు అమలీలను అరెస్ట్ చేసి ఆర్మూర్ పోలిస్టేషన్ కూ తరలించారు. అనంతరం వారు పోలిస్టేషన్ ముందు ధర్నా నిర్వహించరూ..ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం లో.. మౌలానా. శ్రీకాంత్. మాదరి నరేష్. దుర్గం. రాజేందర్. శ్రీను. రహీం. పేరోజ్. పరశురామ్. కిష్టయ్య. మల్లయ్య. తదితరులు పాల్గొన్నారు.
