నవంబర్ మాసం వేతనాల కోసం నిరసన
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:
సమగ్ర కుటుంబ కుల గణన సర్వే చేయలేదనే సాకుతో నవంబర్ నెల వేతనం ఇవ్వకపోవడాన్ని నిరశిస్తు రిసోర్స్ పర్సన్ లు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ( మెప్మా) లో రిసోర్స్ పర్సన్ లుగా పనిచేస్తున్న తమకు ఆరోగ్య ఇతర సమస్యల కారణంగా సర్వే చేయలేదని వేతనం ఇవ్వకపోవడం పై గురువారం ఉదయం ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సంధర్బంగా ప్రతినిధులు స్వర్ణలత మాట్లాడుతు… సర్వే చేయని కారణాలను ఉన్నతాధికారులకు నివేధించిన టూర్ డైరీలను సబ్ మీట్ చేయలేదని వేతనం నిలుపుధల అన్యాయం అన్నారు. ఆర్ పిలకు వచ్చే నెల వేతనం నిలుపుధల చేయడం వలన అర్థిక ఇబ్బందులు వస్తాయని వేంటనే జీతాలును విడుధల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బల్ధియా అధికారులకు వినతి పత్రం సమర్పించారు.

