మెండోరా, బతుకమ్మ : మెండోరా మండల కేంద్రంలో గల కస్తూర్బాగాంధీ బాలికల కళాశాలలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న సీట్లకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు కేజీబీవీ ప్రత్యేకాధికారిణి పద్మ మంగళవారం తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం బైపీసీలో 16 సీట్లు,ఎంపీసీలో 3 సీట్లు ఖాళీగా ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. విద్యార్థినిలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
