ఛత్తీస్ గడ్ లో మరో భారీ ఎన్ కౌంటర్.. 28 మంది మావోల హతం

0 4,164

వెబ్ న్యూస్, బతుకమ్మ:  ఛత్తీస్ గడ్ లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. 28 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఛత్తీస్ గడ్- తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల అడవిప్రాంతంలో గత ఐదు రోజులుగా కూంబింగ్ జరుగుతోంది. అయితే మావోలు చర్చలకు పిలుపునిచ్చినా.. భద్రతా దళాల నుంచి స్పందన రాలేదు. మూడు రాష్ట్రాలకు సంబంధించిన భద్రతా దళాలు మోహరించి కూంబింగ్ నిర్వహించారు. శనివారం జరిగిన దాడిలో దాదాపు 28 మంది మావోలు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

Leave A Reply

Your email address will not be published.