వెబ్ న్యూస్, బతుకమ్మ : సన్ రైజర్స్ జట్టుకు ఆంధ్రా క్రికెట్ సంఘం (ఏసీఏ) ఆఫర్ ఇచ్చింది. పన్ను మినహాయింపులు, ఇతర సహకారం అందిస్తామని, హెచ్ సీఏతో సన్ రైజర్స్ వివాదం నేపథ్యంలో ఏసీఏ ఈఆఫర్ ను ప్రకటించింది. ఈసీజన్ లో మిగిలిన మ్యాచ్ లను విశాఖలో నిర్వహించాలని ప్రతిపాదించామని ఏసీఏ పేర్కొంది. ఎస్ఆర్ హెచ్ జట్టు నుంచి సమాధానం కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొంది. ఐపీఎల్ మ్యాచ్ ఉచిత పాస్ ల కోసం సన్ రైజర్స్ ను హెచ్ సీఏ తీవ్రంగా వేధిస్తుండడంతో ఆఫ్రాంచైజీ నగరాన్నే వీడి వెళ్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే.
