మ్యాచ్ ఫిక్సింగ్ చేసే వారే.. నా వెనుక ప్రభుత్వం ఉంటే ఎలా..?
తనపై కుట్ర చేస్తోంది బీఆర్ఎస్ బడా నాయకుడు
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, బతుకమ్మ: తనపై కుట్ర చేస్తోంది బీఆర్ఎస్ పెద్ద నాయకుడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఇంటి ఆడబిడ్డపై వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ సోదరులు మాట్లాడలేదని కవిత అన్నారు. నల్గొండ జిల్లాలో పార్టీ ఓటమికి కారణమైనా లిల్లీపుట్ నేత నాగురించి మాట్లాడుతారా..? కేసీఆర్ లేకుంటే ఆ లిల్లీపుట్ ఎవరు.? తాను కేసీఆర్ కు రాసిన లేఖ బయటకు లీక్ చేసిందేవరు.? బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ఎందుకు మాట్లాడారో తనకు తెలియదన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ చేసే వారే.. నా వెనుక ప్రభుత్వం ఉందంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వం, కోర్టు అనుమతి లేకుంటే ఇంటి నుంచే బీసీ రిజర్వేషన్ల కోసం దీక్ష చేస్తానని ప్రకటించారు.