హైదరాబాద్, బతుకమ్మ: పార్టీ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసినట్లు కాంగ్రెస్ క్రమ శిక్షణ కమిటీ ప్రకటించాంది. తీన్మార్ మల్లన్న పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడంతో ఆయనకు ఫిబ్రవరి 5వ తేదీన డిసిప్లీన్ కమిటీ షోకాజ్ నోటీసు ఇచ్చి అదే నెల 12వ తేదీలోగా వివరణ ఇవ్వాలంది. మల్లన్న వివరణ ఇవ్వకపోవడంతో సస్పెండ్ చేశారు. ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.