మోపాల్, బతుకమ్మ: ఇందూరు తిరుమల బ్రహ్మోత్సోవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజైన ఆదివారం స్వామి వారి కల్యాణోత్సవాన్ని జరిపించారు. ఆలయ ధర్మకర్తలు దిల్ రాజు, శిరీష్ తోపాటు పలువురు సినీ ప్రముఖులు శతమానం భవతి సినిమా దర్శకుడు సతీష్ వేఘ్నేశ, రచయిత చిన్నికృష్ణ, బలగం ఫేమ్ మధు, ఓదెల ఫేమ్ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. దేవనాథ్ జీయర్ స్వామిగంగోత్రి రామానుజదాసు స్వామి, యజ్ఞాచార్యులు శిఖామణి ఆచార్యరోహిత్ కుమారాచార్య తదితరులు పాల్గొన్నారు