నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా కేంద్రంలోని కుమార్ గల్లీలో గల ప్రభుత్వ పాఠశాలను శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలు విద్యార్థులకు జరుగుతున్న ఎస్ఏ వన్ పరీక్షలను పరిశీలించారు. పరీక్షలు సజావుగా జరుగుతున్నాయా లేదా అనేది క్షేత్రస్థాయిలో పర్యటించి విద్యార్థులకు కావలసిన వసతులను గురించి ఉపాధ్యాయులకు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా అదే పాఠశాలలో కొనసాగుతున్న మిడ్ డే మీల్స్ ప్రక్రియను పరిశీలించారు.