విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి

బతుకమ్మ,మోర్తాడ్: యువకులు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరగాళ్ల ఉచ్చుకు చిక్కకుండా జాగ్రత్త పడాలని మోర్తాడ్ ఎస్సై విక్రమ్ అన్నారు. మోర్తాడ్ మండలం కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో బుధవారం ఎస్సై తన సిబ్బందితో కలిసి విద్యార్థులకు సైబర్ క్రైమ్స్ గురుంచి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Students should be careful
Comments (0)
Add Comment