నంది ఆలయంలో ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ దంపతుల పూజలు

మోపాల్, బతుకమ్మ : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని నిజామాబాద్ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ ధంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోపాల్ మండలంలోని సిర్పూర్  శివారులోని నందిగుడిలో బుదవారం ఉదయం అభిషేకం నిర్వహించారు. నర్సింగ్ పల్లి లోని తెలంగాణ తిరుపతి ఆలయంలో పూజలు చేశారు. ఈ సంధర్బంగా ఆలయ నిర్వాహకులు వారికి తీర్థ ప్రసాధాలు అందజేశారు. వారి వెంట బొంకన్ పల్లి సతీష్ రావు, భూంరావు, రామారావు, ముదక్ పల్లి సాయిలు తదితరులు ఉన్నారు.

SC and ST court judge Srinivas couple worship at Nandi temple
Comments (0)
Add Comment