బిచ్కుందలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

బిచ్కుంద, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు బడులలో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వేణుగోపాల్ జెండా ఆవిష్కరణ చేసి ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు విమల్ కిషోర్ బట్టడ్ స్వగృహమున జెండా ఆవిష్కరణ చేసి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటుబుక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ ప్రజలు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

 

Republic Day celebrations in Bichkunda
Comments (0)
Add Comment