24.8 C
Hyderabad
Friday, July 31, 2026

జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఉపాధ్యాయుల కొరతపై వినతి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . విద్యా వాలంటీర్లను కేటాయించాలి

 

. . . జనగామ గ్రామ సర్పంచ్

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

బిబిపేట మండలంలోని జనగామ గ్రామంలో గల జిల్లా పరిషత్ హైస్కూల్‌లో 9వ, 10వ తరగతులకు సరిపడా ఉపాధ్యాయులు లేని కారణంగా వెంటనే టీచర్లు, విద్యా వాలంటీర్లను కేటాయించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్ ప్రజా ప్రతినిధులతో కలిసి డి.ఇ.ఓ. కార్యాలయ ఏడి శ్రీనివాస్ కు సోమవారం వినతి పత్రం సమర్పించారు. విద్యార్థుల విద్యాభ్యాసం దెబ్బతినకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధులు కోరారు. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మట్ట శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ కప్పేరా రవీందర్ రెడ్డి, మాజీ ఎస్‌ఎంసీ చైర్మన్ బోధస్ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article