నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : శబ్బే భరాత్ పండగ సందర్భంగా ఎంఐఎం ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని బోధన్ రోడ్ లో గల ఖాదీమ్ ఖబరస్థాన్, ఖిల్లా రోడ్ లో గల జధీద్ ఖబరస్థాన్ లను సందర్శించారు. శబ్బే భరాత్ సందర్భంగా నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి అక్కడ లైటింగ్, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈనెల 10లోగా పూర్తిచేయాలని నగర మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ను కోరారు. అధికారులు ఒప్పుకోవడంతో వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఫయాజుద్దీన్, నగర్ మాజీ డిప్యూటీ మేయర్ మీర్ మజాజ్, ప్రధానకార్యదర్శి షాబాజ్ హైమద్, కార్పొరేటర్లు ఎజాజ్ , రియాజ్, అలీ, ముఖీమ్, సమీర్, ఎంఐఎం నాయకులు అమర్, అజిస్ రాయ్, ఖాలీల్ తదితరులు పాల్గొన్నారు.