పర్యాటక కేంద్రంగా నిజాంసాగర్

జుక్కల్, బతుకమ్మ : నిజాంసాగర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని, త్వరలోనే టెండర్లను పిలుస్తామని రాష్ర్ట ఎక్సైజ్, జిల్లి ఇన్ చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి నిజాం సాగర్ మండలం హాసన్ పల్లి శివారులో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు. విద్యుత్ ఉత్పత్తిని త్వరలోను పున:ప్రారంభిస్తామన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, కలెక్టర్ సంగ్వాన్ తదితరులున్నారు.

Nizamsagar as a tourist center
Comments (0)
Add Comment