వెబ్ న్యూస్, బతుకమ్మ : కార్తీక రెండో సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుంచే ఆలయాలకు భక్తులు బారులు తీరారు. విజయవాడ దుర్గా ఘాట్ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో ప్రమిదలు వెలిగించి, అభిషేకాలు నిర్వహించారు. దీంతో ఆలయాల్లో అధ్యాత్మిక శోభ నెలకొంది.