24 C
Hyderabad
Sunday, August 2, 2026

బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల:మండల కేంద్ర నికి చెందిన కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ రెండ్ల రాజారెడ్డి  తల్లీ గంగవ్వ ఇటీవల అనారోగ్యం తో మృతి చెందింది, ఇట్టి విషయాన్ని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకొని శనివారం రోజున టీజీ కో ఆపరేటీవ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డీ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన తో పాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోమా దేవారెడ్డి, మాజీ జెడ్పిటిసి గుల్లే రాజేశ్వర్,ఆడెం గంగ ప్రసాద్, రేండ్ల రమేష్, కోరిపెల్లి లింగరెడ్డి, మాజీ ఎంపీటీసీ సున్నపు అంజయ్య, మునీరుద్దీన్ ,వెంకట్ రెడ్డీ,రవి రెడ్డీ తుపాకుల శ్రీనివాస్, సంషాన్ ,రోక్కేడ సంజీవ్,గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు  కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article