వెబ్ న్యూస్,బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీలో మరో ఇద్దరు మంత్రుల మధ్య వివాదం నెలకొంది. వరంగల్ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జోక్యం ఏంటని మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళీ ప్రశ్నించారు. దేవాదయ శాఖలో పొంగులేటి జోక్యంపై మంత్రి కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై కొండా సురేఖ ఫిర్యాదు చేసింది . మేడారం టెండర్లలో మంత్రి పొంగులేటి జోక్యం చేసుకుని, రూ.71 కోట్ల టెండర్ ను తన మనుషులకు ఇప్పిస్తున్నాడని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కొండా మురళీ ఫిర్యాదు చేశారు.