నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన ముగ్గురికి జైలు శిక్షా, 30 మందికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ పి.ప్రసాద్ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 33 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం సోమవారం కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ ముందు హాజరు పరిచారు. 30 మందికి రూ.57వేల జరిమానా, ముగ్గురికి జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.