సుప్రీంకోర్టు సూటి ప్రశ్న
న్యూఢిల్లీ, బతుకమ్మ: అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన ప్రభుత్వ అధికారిని తిరిగి విధుల్లోకి చేర్చుకోవడాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది. అవినీతి కేసులో దోషిగా తేలిన ప్రభుత్వ ఉద్యోగులు నిర్దోషిగా నిరూపితమయ్యే వరకూ తిరిగి సర్వీసులోకి అనుమతించరాదని గురువారం ఇచ్చిన ఓ తీర్పులో పేర్కొంది. ఇలాంటి వారిని మళ్లీ డ్యూటీలోకి చేర్చుకుంటే ప్రజల విశ్వాసం దెబ్బ తింటుందని జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ప్రసన్న బి.వరలేలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. లంచం కేసులో దోషిగా తేలిన రైల్వే ఇన్స్పెక్టర్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది..!