మద్నూర్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టింది. దాంట్లో భాగంగా మండలంలోని వివిధ రేషన్ షాపులలో పంపిణీ కార్యక్రమాన్ని మండల తహసీల్దార్ ఎండి ముజీబ్ తనిఖీ చేశారు. ప్రజలకు సరఫరా చేస్తున్నా తీరును పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్ లను తనిఖీ చేశారు. ఎలాంటి సమస్య రాకుండ సక్రమంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా పంపిణీ చేయాలని డీలర్లను ఆదేశించారు. తహసీల్దార్ వెంట మండల గిర్దవార్ ఎం శంకర్ ఉన్నారు.