భీమ్ గల్, బతుకమ్మ : పట్టణ కేంద్రానికి చెందిన ఓ పేద కుటుంబానికి పట్టణ యోగ బృందం శుక్రవారం ఆర్థిక సహాయాన్ని అందించింది.పట్టణ కేంద్రానికి చెందిన తుమ్మనపల్లి రవి ఇటీవల మరణించగా అంత్యక్రియలకు ఆర్ధిక సహాయం అందించిన యోగ బృందం శుక్రవారం మరింత నగదు సహాయాన్ని అందించి ఆదుకొంది. యోగ బృంద సభ్యులు పతాని ప్రవీణ్ తాను స్వంతగా భాదిత కుటుంబానికి 25 కిలోల బియ్యన్ని అందంజేశారు.