నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ప్రభుత్వ పథకాలు ప్రజలకి చేరువ కావాలంటే ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకం అని, ఉద్యోగులు ప్రభుత్వానికి, ప్రజలకి వారదులుగా పాత్ర పోషిస్తారని తెలంగాణ గెజిటెడ్ అసోసియేషన్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నగరంలోని మెడికల్ కాలేజీ ప్రాంగణంలో తెలంగాణ గెజిటెడ్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న డిఎ పిఆర్సి పరిష్కరించాలని చర్చించామని తెలిపారు. ప్రభుత్వం ప్రజలకి చేరువ కావాలంటే ఉద్యోగులుగా వారదులుగా ఉంటారని అన్నారు. ఇటీవల టాటా గ్రూప్ ఆధ్వర్యంలో దేశ సేవలో భాగమయ్యి ప్రజలకు సేవ చేసిన వారికి అవార్డు ప్రధానం చేశారు. దేశరత్న అవార్డు పొందిన టీజీవో అధ్యక్షులు అలుక కిషన్ ను ఈ సందర్భంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ అమృత్ కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ జలగం తిరుపతిరావు, దేవి సింగ్, నాగమోహన్, సంఘ సభ్యులు హనుమంత్ రెడ్డి, ప్రవీణ్,లావణ్య, సాయిలు, సాయి కృష్ణ, గోపికృష్ణ, నాగరాజు, పావని, చందర్, స్వామి, జగదీష్ పాల్గొన్నారు.