నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:
లైన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ నేత అధ్వర్యంలోని కోటగల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల( శంకర్ భవన్ హైస్కూల్) లో డాక్టర్స్ డే వేడుకలు నిర్వహించారు. లైన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ నేత క్లబ్ అధ్యక్షులు అంకం లక్ష్మణ్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం పాఠశాలలో మొక్కలు నాటారు.
అనంతరం విద్యార్థులకు డెంటల్ క్యాంప్ ను నిర్వహించి వైద్య పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో తాళ్ల లింగం, దేవిదాస్ ,రీజన్ చైర్ చైర్ పర్సన్ పులగం హనుమాన్లు ,జోన్ చైర్మన్ విష్ణువర్ధన్ , ప్రోగ్రాం చైర్మన్ ధర్మరాజు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మల్లేశం , టీపీటీఎఫ్ అధ్యక్షుడు వెనిగళ్ళ సురేష్ , లైన్ సభ్యులు కైరం కొండ మురళి , తులసీదాస్, పుట్ట గణేష్, గాలిపల్లి రవీందర్ లు పాల్గొనడం జరిగింది.