28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సత్కారం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ , పిట్లం : వారధి స్వచ్ఛంద సేవా సంస్థ బాన్సువాడ వారి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే పాఠశాలలో 2023-2024 సంవత్సరంలో చదివిన పదవ తరగతి విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి 10/10 పాయింట్స్ సాధించిన ముగ్గురు శారధిక, అశ్విత, సంకీర్తన విద్యార్థినిలకు వారధి స్వచ్ఛంద సేవా సంస్థ వారు శాలువా మెమొంటో తో సత్కరించి 2500/- రూపాయలు నగదు ప్రోత్సాహం అందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు ఠాకూర్ గోపాల్ సింగ్ మాట్లాడుతూ .. కష్టపడిన విద్యార్థులకు సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సందేశం ఇచ్చారు. వారధి స్వచ్ఛంద సేవా సంస్థ అయిన మేము గత 14 సంవత్సరాల నుండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ విధంగా ముందుకు వెళుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాల ప్రధానోపాధ్యాయులు గులాం రబ్బాని, సిబ్బంది, వారధి స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు. కిషన్, శ్రీనివాస్ గౌడ్, A.కృష్ణ, p.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article