ఫాంహౌస్ లో  కోడిపందేలకేసు.. విచారణకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ

వెబ్ న్యూస్, బతుకమ్మ : మొయినాబాద్ ఫాంహౌస్ లో  కోడిపందేల కేసులో విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీసులు ఆయన్ను వివిధ అంశాలపై విచారించారు. గతంలో ఈవిషయమై శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.  ఫాంహౌస్ ను లీజుకు ఇచ్చానని విచారణలో ఆయన తెలిపారు. లీజుకు సంబంధించిన డాక్యుమెంట్లపై అనుమానాలు రావడంతో మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు.  కాగా ఫిబ్రవరి 11న తోల్కట్ల గ్రామ పరిధిలోని శ్రీనివాస్ రెడ్డి ఫాంహౌస్ పై ఎస్ వోటీ, మొయినాబాద్ పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈదాడుల్లో 46 కోడి కత్తులు, బెట్టింగ్ కాయిన్స్, 64 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈక్రమంలో 64 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

BRS MLC attends hearing of cockfighting case in farmhouse
Comments (0)
Add Comment