29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎస్డిఎఫ్ ఫండ్స్ షబ్బిర్ ఆలీ పెత్తనంపై బిజేపి మండిపాటు

Must read

📰 Generate e-Paper Clip

  • బల్ధియా ప్రమేయం లేకుండా నిధుల కేటాయింపుపై ఆగ్రహం
  • జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేసిన బిజేపి కార్పొరేటర్ల

బతుకమ్మ, నిజామాబాద్ : నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి మంజూరైన ఎస్డిఎఫ్ ఫండ్స్ పై ప్రభుత్వ సలహదారు షబ్బిర్ ఆలీ పెత్తనం పై నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ బిజేపి కార్పోరేటర్లు మండిపడ్డారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే, మున్సిపల్ కార్పొరేషన్ కార్పోరేటర్ల ప్రమేయం లేకుండానే పంచాయతీ రాజ్ శాఖ నుంచి నేరుగా కాంగ్రెస్ కార్యకర్తలకు పనులను కమీషన్ బెస్ పై ఇవ్వడాన్ని నిరసన తెలిపారు.BJP's anger over Shabbir Ali's increase in SDF funds

ఈ మేరకు బుదవారం బిజేపి కార్పొరేటర్లు ప్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, డిప్యూటి ప్లోర్ లీడర్ న్యాలం రాజు అధ్వర్యంలో జిల్లాకలెక్టర్ రాజీవ్ గాంధి హన్మంతుకు పిర్యాదు చేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రజా ప్రతినిధుల హక్కులను కాలరాస్తు, దుశ్చర్యలకు పాల్పడుతున్న షబ్బిర్ ఆలీని అడ్డుకుంటామని అన్నారు. నిజామాబాద్ నగర డేవలప్ మెంట్ కోసం వచ్చిన నిధులను ఎలాంటి ప్రణాళికలు లేకుండా, ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోకుండా నిధులను ఇష్టరితిన ఖర్చు చేస్తామంటే చూస్తు ఉరుకోమని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎర్రం సుదీర్, వెల్డింగ్ నారాయణ, సాదు సాయివర్ధన్, ఆకుల హేమలత, బిజేపి నాయకులు తదితరులు పాల్గోన్నారు.

 

More articles

Latest article