వెబ్ న్యూస్,బతుకమ్మ : ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం తొక్కిసలాట జరిగింది.ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. కార్తీక మాసం ఏకాదశి కావడంతో వైష్ణవ ఆరాధన కోసం భక్తులు అంచనాకు మించి తరలివచ్చారు. ఈప్రమాదంలో పలువురు గాయపడగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.