బోదన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రంలోని మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు జాతీయ రహదారి పై దళిత సంఘాల ఆధ్వర్యంలో శనివారం అమీషా కు వ్యతిరేకంగా నినాదాలు చేసి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా దళిత సంఘా నాయకులు మాట్లాడుతూ పార్లమెంట్ సభలో కేంద్ర హోం మంత్రి అమీషా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయన వెంటనే మంత్రి పదవికి రాజీ నామ చేయాలని, పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాం డ్ చేశారు. లేనిఏడలా తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాహుల లక్ష్మణ్, సింగడి పాండు, బీఎస్పీ నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు సలెన్ సంజు,
సరిడే యాదు, దేవేందర్, మదిలే సాయిలు, పోతురాజు, శీను, గంగాధర్, సంబాజీ విటల్, సునీల్, సైయాజి శ్రీకాంత్, హనుమాన్లు. తదితరులు పాల్గొన్నారు.

