27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పోచారం  ప్రాజెక్టులోకి రోడ్డు స్థలం కేటాయింపు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ : నాగిరెడ్డిపేట : మండలంలోని వదలపర్తి గ్రామంలో పోచారం ప్రాజెక్టు శిఖం భూములలో పశువులు మేతకు వెళ్లడానికి, పాత హనుమాన్ ఆలయం వద్దకు గ్రామస్తులు వెళ్లడానికి రోడ్డు ఏర్పాటు కోసం స్థలాన్ని గుర్తించినట్టు రెవెన్యూ గిర్దావర్ మహమ్మద్ తెలిపారు. వదలపర్తి గ్రామస్తులు తమ గ్రామంలోని పాత వదలపర్తి గ్రామ హనుమాన్ ఆలయం వద్దకు వెళ్లడానికి, పోచారం ప్రాజెక్టు శిఖం భూములలో పశువులు మేతకు వెళ్లడానికి సరైన దారి లేకపోవడంతో గ్రామస్తులు తహశీల్దార్ కు రోడ్డుకు స్థలం కేటాయించాలని గత కొన్ని రోజుల క్రితం వినతి పత్రం అందజేశారు. దీంతో తహశీల్దార్ ఆదేశాల మేరకు వదలపర్తి గ్రామంలో గ్రామస్తుల సమక్షంలో రెవెన్యూ సర్వేయర్ తో రోడ్డు కోసం పాత రహదారికి ఇరువైపులా ఉన్న భూములను సర్వే చేయించి స్థలాన్ని కేటాయించినట్లు ఆర్ ఐ మహమ్మద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అజీముద్దీన్, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ కానిస్టేబుల్ చంద్రయ్య, గ్రామస్తులు ఉన్నారు.

More articles

Latest article