నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా మూడవ మహాసభలో కార్యవర్గాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగాకే రామ్మోహన్రావు, అధ్యక్షుడుగా శిల్ప హనుమాన్లు, ప్రధాన కార్యదర్శిగా ఈవీఎల్ నారాయణ, కోశాధికారిగా లావు వీరయ్య, ఉపాధ్యక్షులుగా పుష్పవల్లి, అమీదుద్దీన్, ప్రసాదరావు, జార్జి, పురుషోత్తం రావు, బట్టి గంగాధర్, బాబా గౌడ్, కార్యదర్శులుగా కె.వి.కృష్ణారావు, ప్రేమలత, లింగయ్య, దీన సుజన, రామచందర్ మధుసూదన్, బిర్లా నాగేశ్వరరావు, భోజరావు, పాండురంగం లను ఎన్నుకున్నారు.
