ఎల్లారెడ్డి, బతుకమ్మ :
ఎల్లారెడ్డి లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో వచ్చే సంవత్సరం 2026-27 కొరకు అడ్మిషన్ క్యాంపెయిన్ కార్యక్రమం ప్రారంభం చేసినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఇ.లక్ష్మి నారాయణ తెలిపారు. శుక్రవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు డాక్టర్ గంగా రెడ్డి, కృష్ణ ప్రసాద్, శశిధర్, చంద్ర కాంత్, గోదావరి, రాణి, దశరథం, మైమూద్, సురేష్ రెడ్డి లు కలిసి వివిధ జూనియర్ కళాశాలు లింగంపేట్ ప్రభుత్వ జూనియట్ కళాశాల, ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల, సోమార్ పెట్ ప్రభుత్వ గురుకుల జూనియర్ కళాశాలలకు వెళ్లి అడ్మిషన్ క్యాంపెయిన్ చేసారని ప్రిన్సిపాల్ తెలిపారు.

తమ కళాశాలలో విద్యార్థులకు చదువు కోవడానికి బీఏ, హెచ్ఈపీ, ఈపీపీ, హెచ్ఈపీఏ, హెచ్ పీపీఏ, బీ కామ్ (సీఏ), బీఎస్పీ బీజెడ్సీ, బీఎస్పీ – ఎంపీసీ & ఎంపీసీఎస్ కోర్స్ లు కలవని ప్రిన్సిపాల్ తెలిపారు.

