29 C
Hyderabad
Monday, August 3, 2026

పాకిస్తాన్ కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, వేల్పూర్ :-మండలంలోని వేల్పూర్ లో సింధూర ఆపరేషన్ లో భాగంగా భారత సైనికులు నిన్న జరిగినటువంటి దాడిలో పాకిస్తాన్ కి చెందిన కొందరు మృతి చెందడంతో దీనికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వేల్పూర్ గ్రామానికి చెందిన వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామంలోని వివిధ యువజన సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ కు మద్దతుగా పోస్ట్ పెట్టిన వ్యక్తిపై వెంటనే కేసు నమోదు చేయాలని ఆయనపై చర్యలు తీసుకోవాలని  పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకవైపు దేశం మొత్తం పాకిస్తాన్ పై దాడిని ఖండిస్తుంటే మరోవైపు గ్రామానికి చెందిన వ్యక్తి ఇది సరైనది కాదని.. సోషల్ మీడియాలో పాకిస్తాన్ కు మద్దతుగా పోస్ట్ పెట్టాడని యువజన సంఘాల సభ్యులు ఆరోపించారు. సోషల్  మీడియాలో తప్పుడు పోస్ట్ పెట్టిన ఆయనపై చర్యలు తీసుకోకుంటే ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని ఈ సందర్భంగా యువజన సంఘాల సభ్యులు హెచ్చరించారు. ఈ కార్యక్రంలో యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article