రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండల కేంద్రంలోని మల్లయ్య గుట్టకు వెళ్లే దారిలో నక్కల ఓర్రె పోయే రోడ్డు, సాసర గుంట కట్ట నెం: 301 ఈ రెండు రోడ్లను ఏంబరి యమన్ అను వ్యక్తి 50 సంవత్సరాల నుండి ఉన్న రోడ్డును కబ్జా చేయడమే కాకుండా నక్కల ఓర్రే రోడ్డు సుమారు 20 ఫీట్లు కూడా జేసీబీ , ట్రాక్టర్ సహాయంతో తోడేస్తున్నారు. రోడ్డు కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం రోజున రైతులు తహసీల్దార్ తారాబాయికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రోడ్డు కబ్జా గురించి ఎవరైనా రైతులు అడిగితే వాళ్ళ పై దౌర్జన్యం చేయడమే కాకుండా దురుసుగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. ఈ భూములును సర్వే చేసి ఈ వ్యక్తి పై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. వినతి పత్రం అందించిన వారిలో రైతులు భోజగొండ అనీల్, కొత్తపల్లి రవికిరణ్, సూరజ్ శ్రీనివాస్, బుద్దె శివకుమార్, బైండ్ల అనీల్, బుద్దె రమేష్ తదితరులు ఉన్నారు.

