. . . లారీ డికోని రైతు దుర్మరణం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
నిజామాబాద్ నగరంలోని ఆర్సపల్లి వద్ధ గల బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాధంలో రైతు దుర్మణం చెందాడు. ఈ సంఘటన గురువారం మద్యహ్నం జరిగింది. ఆర్సపల్లి గ్రామానికి చెందిన తరికంటి యాదయ్య (78) అర్సపల్లి శివారులోని అతని వ్యవసాయ భూమిలో పని ముగించుకుని అతని టీవీఎస్ ఎక్సెల్ బండి పైన ఇంటికి వచ్చే క్రమంలో ఈ ప్రమాధం జరిగింది. అర్సపల్లి రైల్వే గేటు దాటిన తర్వాత ఉన్న మలుపు వద్ద టివిఎస్ ఎక్సేల్ ను లారీ డికోట్టంది. ఈ ప్రమాధంలో తరికంటి యాదయ్య తలకు బలమైన గాయమై అక్కడికక్కడే చనిపోయినాడు. అతని భార్య తరికంటి ఎల్లవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆరవ టౌన్ ఎస్ఐ వేంకట్రావ్ తెలిపారు.
