బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని రామేశ్వరపల్లి గ్రామంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా గ్రామస్తులు ఘనంగా నివాళులు అర్పించారు . ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ మన దేశ రక్షణ వ్యవస్థకు అను శక్తిని జోడించిన మిసైల్ మ్యాన్ అని కలాంను కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు .ఈ సమావేశంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు ఏనుగు శ్రీనివాసరెడ్డి వీడిసి ఉపాధ్యక్షులు ఏలేటి రమేష్ రెడ్డి వడ్డే శశి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ గౌడ్ రమేష్ రెడ్డి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
