ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని చంద్రయనోయల్పల్లి గ్రామానికి చెందిన వేముల మనోజ అనే యువతి ఆదివారం సాయంత్రంఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుం దని ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు. తన యొక్క భర్త సాయిలు అదనపు కట్నం కోసం వేధించడం వలన వేధింపులు తట్టుకోలేక చంద్రయాన్ పల్లి శివారులో పెద్ద పోచమ్మ గుడి దగ్గర ఊరేసుకుందని తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. .మృతురాలి అన్న మూడెడ్ల సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ మనోజ్ కుమార్ తెలిపారు. మృతురాలు శవాన్ని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించడం జరిగిందని తెలిపారు.
