బతుకమ్మ, కోటగిరి : ఇటీవల జరిగిన నవోదయ, సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి సీటు సాధించిన కర్నె బిశ్వజిత్, పి. గౌతమ్ కృష్ణ లను మున్నూరు కాపు సంఘం, పెద్ద హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూల మాలలు వేసి ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు బర్ల చిన్న గంగాధర్,సభ్యులు అలాగే యశశ్రీ స్కూల్ కరస్పాండెంట్ పి.అనిల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆలయంలోనీ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి విద్యార్థులకు శాలువతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కోటగిరి గ్రామ తాజా మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్,కోటగిరి సింగిల్ విండో చైర్మెన్ కూచి సిద్దు,ఆకుల పోశట్టి,కాపు గాండ్ల శ్రీనివాస్,కప్ప సంతోష్,కర్నె పోశట్టి,బీర్కూర్ శ్యామ్,పి.గోపి కృష్ణ,కే.భూ పేందర్,గోక శంకర్,చిత్తరి రాజు,తదితరులు పాల్గొన్నారు.
