27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఐదు ఫీట్ల తేలు మైసమ్మ రెండు ఫీట్లయ్యింది

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ:  నగరంలోని ఖిల్లా సమీపంలో ఉన్న అతి పురాతనమైన తేలు మైసమ్మ ఐదు ఫీట్ల నుంచి రెండు ఫీట్లకు తగ్గింది. రెండు సంవత్సరాల క్రితం ఊర పండుగ సందర్భంగా అధికారులు మొరం నింపడంతో తేలు మైసమ్మ ప్రతిమ ఎత్తు రెండు ఫీట్లకు తగ్గింది. పాత విగ్రహానికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన భక్తులు ఇప్పటిడు అమ్మవారి విగ్రహాన్ని చూసి విస్తుపోతున్నారు. అధికారులు స్పందించి తేలు మైసమ్మ విగ్రహాన్ని ఎప్పటిలాగే ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే విగ్రహం మరింత కూరుకుపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

More articles

Latest article