ఆర్మూర్, బతుకమ్మ
పోద్దున పూట పోలంకు వెలుతున్న రైతును గుర్తు తెలియని వాహనం డికోట్టడంతో మృతి చెందాడు. ఈ సంఘటన అదివారం తెల్లవారు జామున ఆర్మూర్ మండలం పెర్కిట్ వద్ధ జాతీయ రహదారీ 44 పై రిలయన్స్ పెట్రోల్ పంప్ వద్ద జరిగింది. హైద్రబాద్ నుంచి నిర్మల్ వెలుతున్న గుర్తు తెలియని వాహనం పెర్కిట్ గ్రామానికి చెందిన శ్రీరామ్ ఆశోక్ ( 55) ను బైక్ పై వెలుతుండగా డికోట్టింది. ఈ సంఘటనలో ఆశోక్ అక్కడికక్కడే మరణించాడు. ఈ మేరకు ఆర్మూర్ పోలిసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

