ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ పట్టణంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశ్వర కాలనీకి చెందిన మహిళ మంగళవారం హత్యకు గురైంది. మహిళ మృతదేహం రక్తపు మడుగులో కనిపించింది. విషయాన్ని తెలుసుకున్న ఏసిపి వెంకటేశ్వర్ రెడ్డి, సీఐ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళ మృతికి గల కారణాలను, ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
