25.9 C
Hyderabad

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్

Must read

📰 Generate e-Paper Clip

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

భవానిపేట్ బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు మంద గోవిందా రెడ్డి మాతృమూర్తి ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ ప్రభుత్వ విప్, బీఆర్‌ఎస్ నాయకులు గంప గోవర్ధన్ సోమవారం వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మృతురాలి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ పరామర్శ కార్యక్రమంలో పల్వాంచ మండల అధ్యక్షులు బొంబోతుల రాజా గౌడ్, కుంభల రవి యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ రావు, శ్రీకాంత్ రెడ్డి, రాఘవేందర్ రావు, సర్పంచులు శ్రీనివాస్ గౌడ్, గ్యార సాయిలు, మండల నాయకులు పైడకుల రాములు, గంగా రెడ్డి, రమేష్ గౌడ్, రాజా నర్సు, బాల గౌడ్, నర్సింలు, యూత్ అధ్యక్షులు దేవరాజ్, ప్రశాంత్ రెడ్డి, ఆకు రాజం, నరేష్, రంజిత్, సాయి గౌడ్, శ్రీనివాస్ తదితర ఎల్లారెడ్డి మండల కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Former government whip visits victim's family

More articles

Latest article